బల్లియా (యూపీ), జూన్ 16: జూన్ మాసం వచ్చినా ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం తగ్గడం లేదు. దీంలో ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో ఎండవేడి, వడగాలులకు 34 మంది మృతి చెందారు.
వడదెబ్బకు జిల్లా దవాఖానలో చేరి గత 24 గంటల్లో 34 మంది మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. వీరిలో అధికులు 60 ఏండ్ల పైబడిన వారేనన్నారు.