ముంబై: మహారాష్ట్రలో (Maharashtra) కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాధార ప్రజలతోపాటు వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా వైరస్ వదిలిపెట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజుల్లో 338 మంది రెసిడెంట్ డాక్టర్లు కరోనా బారినపడ్డారని డాక్టర్ అవినాశ్ దహిఫాలే తెలిపారు.
మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 36,265 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలో 20,181 కేసులు ఉన్నాయి. బుధవారం నాటికంటే ఇవి 36.6 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసుల్లో 85 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. వీరిలో 1170 మంది దవాఖానలో చేరారని, 106 మంది ఆక్సిజన్ అవసరమవుతున్నదని పేర్కొన్నారు.