న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేంద్రప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, అదనపు కార్యదర్శులుగా నియమించడానికి యూపీఎస్సీ 31 మంది ప్రైవేటు రంగ నిపుణులను ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. వీరిలో ముగ్గురు సంయుక్త కార్యదర్శులు. 19 మంది డైరెక్టర్లు, 9 మంది అదనపు కార్యదర్శులని తెలిపింది. వివిధ మంత్రిత్వ శాఖల్లో డిప్యుటేషన్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో అభ్యర్థులను నియమించడానికి రిక్రూట్మెంట్ చేపట్టాలని కేంద్రం గతేడాది డిసెంబర్లో యూపీఎస్సీని కోరింది. యూపీఎస్సీ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసింది.