శ్రీనగర్, డిసెంబర్ 16: దేశానికి ఉగ్రవాదుల చొరబాటు ముప్పు పొంచి ఉన్నదని, దాదాపు 250-300 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు జమ్ముకశ్మీర్ సరిహద్దుల వెంబడి వేచిచూస్తున్నారని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఐజీ అశోక్ యాదవ్ వెల్లడించారు. లాంచ్పాడ్ల వద్ద 250-300 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు వేచిచూస్తున్నారనే సమాచారం ఉన్నదని తెలిపారు. అయితే చొరబాటు యత్నాలను సమర్థవంతంగా భగ్నం చేస్తామన్నారు.
గత కొన్నేండ్లుగా భద్రతా బలగాలు, కశ్మీర్ ప్రజల మధ్య బంధం పెరిగిందని అన్నారు. ప్రజలు తమకు సహకారం అందిస్తే.. అభివృద్ధి కార్యకలాపాలను తాము మరింత మెరుగైన మార్గంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.