న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈవో సౌరభ్ గార్గ్ ఇవాళ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇండియాలో దశాబ్ధం క్రితం ఆధార్ సేవలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో 131 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆధార్తో నకిలీ లబ్ధిదారుల్ని వ్యవస్థ నుంచి తరిమేసినట్లు ఆయన తెలిపారు. ఆధార్తో లింకైన నేరుగా నగదు బదిలీ విధానం వల్ల ప్రభుత్వం ఇప్పటి వరకు 2.25 లక్షల కోట్లు ఆదా చేసినట్లు సౌరభ్ గార్గ్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 300 స్కీమ్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 పథకాలతో ఆధార్ లింకు ఉన్నట్లు సౌరభ్ వెల్లడించారు. దేశంలోని 99.7 శాతం వయోజనులు ఆధార్ కార్డు పొందినట్లు ఆయన తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువులకు కూడా ఆధార్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మన దేశంలో ఉన్న సెక్యూర్టీ వ్యవస్థ ప్రపంచ స్థాయిలో ఉన్నట్లు గార్గ్ తెలిపారు.