Bee Attack | జైనథ్ (బేల), ఏప్రిల్ 11 : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని రేణిగూడ గ్రామంలో గురువారం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. సుమారు 100 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరికి స్థానికంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స అందించారు.
ఇందులో తీవ్రంగా గాయపడిన 40 మందిని రిమ్స్కు తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఉపాధి కూలీలతోపాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న కూలీలను మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు.