(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జులై 24 (నమస్తే తెలంగాణ): దేశవాప్తంగా మహిళపై హింస పెరిగిందని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నివేదిక చెబుతున్నది. మహిళలపై నేరాలకు సంబంధించి 2021లో 23,700 కేసులు నమోదు కాగా, 2022లో 30 శాతం పెరిగి 30,957 ఫిర్యాదులు రిజిస్టర్ అయ్యాయని తెలిపింది. వీటిల్లో సగానికి పైగా 16,872(54.5 శాతం) ఫిర్యాదులు ఒక్క బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ నుంచే వచ్చాయి. రెండవ స్థానంలో ఢిల్లీ ఉండగా, మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉంది. 2022లో మహిళలపై వరకట్నం వేధింపులు, అత్యాచారం, అత్యాచారయత్నం లాంటి కేసుల సంఖ్య పెరిగిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.