న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటుచేసుకున్నది. అభంశుభం తెలియని మూడేండ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరీకి చెందిన మూడేండ్ల బాలిక శుక్రవారం ఉదయం కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెకోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి పొరుగింటికి చెందిన ఓ వ్యక్తి తారసపడ్డాడు. తాను ఆ చిన్నారిని ఊరి చివరన ఉన్న అటవీ ప్రాంతంలో చూశానని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
దీంతో బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్లీడింగ్ అవుతుండటంతో ఆ చిన్నారి ఏడుస్తూ వారికి కనిపించింది. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అటునుంచి ఎయిమ్స్కు చికిత్స నిమిత్తం తరలించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారిని రామ్నివాస్ పానిక (27), శక్తిమాన్ సింగ్ (22)గా గుర్తించారు. వారిద్దరికి వివాహమైందని, స్థానికంగా ఓ గార్బేజ్ రీసైకిల్ కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.