జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు 12 గంటల వ్యవధిలో ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు.
హదీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతాదళాలకు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులకు భద్రతా దళాలు తారసపడటంతో వారిపైకి కాల్పులు ప్రారంభించారు.
దీంతో భద్రతా దళాలు అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. తొలుత ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవలే ఉగ్రవాద సంస్థలో కొత్తగా చేరిన ఓ ముష్కరుడిని లొంగిపోవాలని భద్రతా దళాలు కోరారు.
అతడి కుటుంబ సభ్యులను సైతం ఘటనాస్థలానికి తీసుకువచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఆదివారం ఉదయం హతమార్చినట్లు తెలిపారు.
ఘటనాస్థలం నుంచి పోలీసులు ఓ ఏకే-47ను, పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. షోపియాన్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి