ఫిరోజ్పూర్: పంజాబ్లోని ఫిరోజ్పూర్(Ferozpur)లో దారుణ ఘటన జరిగింది. ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీచర్లు మృతిచెందగా, మరో 11 మంది టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. జలాలాబాద్ నుంచి 14 మంది టీచర్లు ఓ జీపు(Jeep) ఎక్కారు. వివిధ స్కూళ్లలో పనిచేసే ఆ టీచర్లు(Teachers) ప్రతి రోజూ జీపులో వెళ్తుంటారు. ఖాయి ఫెమి కే గ్రామం సమీపంలో టీచర్లు ప్రయాణిస్తున్న జీపు.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడం వల్ల.. జీపు విండోలను బ్రేక్ చేసి మరీ మృతదేహాలను వెలికితీశారు. ఓవర్లోడ్ అయిన జీపు.. ట్రక్కును ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.