ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో (Palghar) ఘోరం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 17 ఏండ్ల బాలికపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉపాధి కల్పిస్తామని బాలికను నమ్మించిన ముగ్గురు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం పాల్ఘర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ఘటన అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని, వారిపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశామన్నారు.
నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, మరొకరి భార్యను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మిగిలిన ఇద్దరికోసం గాలిస్తున్నామని వెల్లడించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించామని చెప్పారు.