లక్నో: ముగ్గురు కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులు తుపాకీతో కాల్పులు జరిపి చంపారు. (Family Shot Dead By Relatives) ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి, అతడి భార్య, కుమారుడు ఈ సంఘటనలో మరణించారు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. మలిహాబాద్ ప్రాంతానికి చెందిన సలీం, లల్లన్ సోదరులు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఉమ్మడి బ్యాంకు ఖాతాలోని డబ్బుపై కోర్టులో వివాదం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కోర్టు విచారణకు ఇరు కుటుంబాలు హాజరయ్యాయి.
కాగా, కోర్టు వాయిదా పడిన తర్వాత సలీం కుమార్తె ఫర్హీన్ ఇంటికి లల్లన్, అతడి కుమారుడు అనుచరులు జీప్లో వచ్చారు. ఈ సందర్భంగా ఫర్హీన్ కుటుంబం వేరే భూ వివాదంపై కల్పించుకోవడంపై వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత లల్లన్, ఆ తర్వాత అతడి కుమారుడు తుపాకీతో కాల్పులు జరిపారు. ఫర్హీన్, ఆమె భర్త మునీర్, వారి కుమారుడు హంజాలాపై కాల్పులు జరిపి హత్య చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. కాగా, సీసీటీవీలో రికార్డైన కాల్పుల సంఘటనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मौके पर उच्चाधिकारीगण मय पुलिस बल मौजूद है, आवश्यक वैधानिक कार्यवाही की जा रही है।
— LUCKNOW POLICE (@lkopolice) February 2, 2024