జైపూర్: రాజస్థాన్లోని ఓ ఆలయంలో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకున్నది. దీంతో ముగ్గురు భక్తులు మృతిచెందారు. సికర్ జిల్లాలోని ఖతు శ్యామ్జీ ఆలయంలో మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటలకు స్వామివారికి తొలిపూజల అనంతరం అర్చకులు ఆలయ తలుపులు తెరిచారు.
భక్తులు ఒక్కసారిగా గుడిలో వెళ్లేక్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో పలువురు కిందపడిపోయారు. దీంతో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జైపూర్లోని దవాఖానకు తరలించారు.
Rajasthan | Three people died, several injured at Khatu Shyamji Temple in Sikar where a stampede occurred during a monthly fair, earlier this morning. Two injured people referred to a hospital in Jaipur. Police present at the spot. Further details awaited. pic.twitter.com/bgnL9sRr1j
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 8, 2022