లక్నో: ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) డియోరియా పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భారీవర్షాలతో పట్టణంలోని రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. సోమవారం ఉదయం రెండు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోడంతో అందులో నివాసముంటున్న ముగ్గురు మృతిచెందారని అధఙకారులు తెలిపారు. మరణించిన వారిలో రెండేండ్ల చిన్నారి, ఆమె తల్లదండ్రులు ఉన్నారని చెప్పారు. కాగా, ముందు జాగ్రత్తగా కూలిన భవనం పక్కన ఉన్న ఇండ్లలోని జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లు కూలిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.
#WATCH | UPDATE: An old house collapsed on Ansari Road late at night around 3 am. Three people were found dead during this. District Administration, police department and fire service have recovered their bodies: Saurabh Singh, SDM Sadar, Deoria https://t.co/hFzc0OgQfh pic.twitter.com/4fkELVyYo8
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 19, 2022