ఇంఫాల్: జాతుల పోరుతో రగులుతున్న మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నది. వాహనాల్లో ప్రయాణిస్తున్న చర్చి నేతలపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో జాతీయ రహదారి దిగ్బంధానికి కుకీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. (Manipur) బుధవారం చురాచంద్పూర్ జిల్లాలోని లామ్కాలో జరిగిన థాడౌ బాప్టిస్ట్ అసోసియేషన్ (టీబీఏ) సమావేశానికి కొందరు చర్చి నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత రెండు వాహనాల్లో కాంగ్పోక్పికు బయలుదేరారు.
కాగా, మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు వారి వాహనాలపై కాల్పులు జరిపారు. టీవీఏకు చెందిన ముగ్గురు చర్చి నేతలు ఈ కాల్పుల్లో మరణించారు. మణిపూర్ బాప్టిస్ట్ కన్వెన్షన్ (ఎంబీసీ) మాజీ ప్రధాన కార్యదర్శి రెవ. వీ సిట్లౌ, రెవ. వీ కైగౌలున్, పాస్టర్ పాగౌలెన్గా మృతులను గుర్తించారు.
మరోవైపు ఈ దాడిలో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన రెవ. ఎస్.ఎం. హాపు, రెవ. హెకై సిమ్టే, రెవ. పావోతాంగ్, రెండు వాహనాల డ్రైవర్లు లెలెన్, గౌమాంగ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే చర్చి నేతలపై కాల్పులు జరిపి హత్య చేయడాన్ని కుకీ విద్యార్థి సంఘం ఖండించింది. నాగాలాండ్, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మణిపూర్ను అనుసంధానించే కీలక జాతీయ రహదారి 2ను తక్షణమే దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. ఈ సంఘటన నేపథ్యంలో కుకీ, జో ప్రజలు నివసించే కాంగ్పోక్పి, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్నది.
Deeply pained by the terrorist attack on Thadou Church leaders in Manipur today. Heartbreaking and unbearable.
Today, these church leaders laid down their lives in service and faith to God. To live is Christ, and to die is gain. Yet one painful question remains – is this due to… pic.twitter.com/CnhVjyoQGB
— Michael Lamjathang Thadou (@Michael_Thadou) May 13, 2026