తిరువనంతపురం: లోక్సభ ఎన్నికల(Lok Sabha Polls) కోసం కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులందరూ తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘం ప్రకారం ఏప్రిల్ 4వ తేదీ.. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు. అయితే తాజా సమాచారం ప్రకారం.. కేరళలో 20 నియోజకవర్గాల నుంచి 290 మంది అభ్యర్థులు ఈ సారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఆ నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. ఏప్రిల్ 8వ తేదీ నామినేషన్లను విత్డ్రా చేసుకోవచ్చు.