Delhi | రైతుల ఛలో ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రైతులు పార్లమెంట్ హౌస్, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపునున్నట్లు రైతులు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలోని 29 సరిహద్దులను మంగళవారం మూసివేశారు. సరిహద్దులను న్యూఢిల్లీ జిల్లాకు ఆనుకుని ఉన్న జిల్లాల పోలీసులతో సంయుక్తంగా పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. దీంతో న్యూఢిల్లీలోకి ప్రవేశించే మార్గాల్లో.. న్యూఢిల్లీ జిల్లా సరిహద్దుల్లో తెల్లవారుజాము నుంచే వాహనాలు బారులు తీరాయి. మధ్యాహ్నానికి మూడు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
రైతుల ఢిల్లీ ఛలో నిరసన కారణంగా ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నది. ఇక్కడ ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులుపడుతున్నారు. ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. రైతుల నిరసన దృష్ట్యా ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు. పొద్దంతా రోడ్లపై జామ్ నెలకొన్నది. సాయంత్రానికి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఘాజీపూర్ సరిహద్దులో భారీ ట్రాఫిక్ జామ్ కనిపించింది. రైతుల నిరసన కారణంగా సింగు సరిహద్దును మూసివేశారు. దీంతో అక్కడి నుంచి తప్పించుకోవాలని ఢిల్లీ పోలీసులు సాధారణ ప్రజలను కోరారు.
ముకర్బా చౌక్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు చేసినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. రైతుల నిరసన దృష్ట్యా టిక్రీ సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దపెద్ద సిమెంట్ దిమ్మెలు వేసి రోడ్డును మూసివేశారు. ఇదిలా ఉండగా ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. దీంతో సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైతుల ఉద్యమానికి సంబంధించి సరిహద్దుతో పాటు ఢిల్లీ లోపల పోలీసులు, అన్ని భద్రతా సంస్థలు వచ్చి వెళ్లే ప్రతి వ్యక్తిపై నిఘా వేస్తున్నారు. అలాంటి దృశ్యమే ఢిల్లీలోని ఐటీఓలో సైతం కనిపిస్తున్నది.
#WATCH | Delhi: Heavy traffic snarl at Ghazipur border in view of the farmers’ protest.#FarmersProtest2024 pic.twitter.com/BMmVFVQ9vi
— ANI (@ANI) February 13, 2024