న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆన్లైన్ గేమ్లు, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్బుల ద్వారా జరిగే బెట్టింగుల పూర్తి ముఖ విలువపై 28 శాతం జీఎస్టీని విధిస్తూ సవరించిన జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.
రెండు బిల్లులకు సంబంధించిన ప్రతిపాదనలను రాజ్యసభ ఎలాంటి చర్చ నిర్వహించకుండానే మూజువాణీ ఓటుతో ఆమోదించి లోక్సభకు పంపింది. కాగా, ద్రవ్య బిల్లులైన ద సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సవరణ) బిల్లు-2023, ద ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సవరణ) బిల్లు-2023లను లోక్సభ ఆమోదించింది.