మనం ఆటోలో ఇరికిరికి ఓ పది మంది ప్రయాణించడం చూస్తుంటాం. కానీ, యూపీలోని ఓ ఆటో రిక్షాలో కూర్చున్న ప్యాసింజర్లను చూసి పోలీసులే షాకయ్యారు. 7 సీటర్లో ఏకంగా 27 మంది కూర్చొని ఉండగా, ఓవర్స్పీడ్తో ప్రయాణిస్తున్న ఆటోను ఆపి చూసిన పోలీసులకు మతిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఫతేపూర్లోని బింద్కీ కొత్వాలి ప్రాంతంలో ఈ ఆటో కనిపించింది. ఇందులో కేవలం ఏడురుగు మాత్రమే ప్రయాణించే సామర్థ్యం ఉండగా.. ఆ డ్రైవర్ వృద్ధులు, చిన్నారులు సహా 27 మందిని ఎక్కించాడు. అంగుళంకూడా గ్యాప్ లేకుండా అందరూ ఇరికిరుకుగా కూర్చున్నారు. పోలీసులు వారందరినీ కిందికి దించి లెక్కించారు. అనంతరం డ్రైవర్పై కేసు నమోదు చేశారు. ఈ వీడియోకు 85.1 వేల వ్యూస్ రాగా, 3వేల మంది షేర్ చేశారు. అంతమందితోనూ ఆ ఆటో ఓవర్స్పీడ్ వెళ్తోందంటే దీన్ని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కించాల్సేందనని ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు.
जनसंख्या विस्फोट का दुष्परिणाम
ऑटो एक और सवारी सत्ताईस👇 pic.twitter.com/ex7QCiRJTp
— Ashwini Upadhyay (@AshwiniUpadhyay) July 11, 2022