న్యూఢిల్లీ: మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దీంతో ఉదయం 11 గంటల వరకు 27.34 శాతం ఓటింగ్ నమోదయింది. అత్యధికంగా ఇంఫాల్ వెస్ట్లో 31.60 శాతం పోలింగ్ రికార్డయింది.
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. మొదటి విడుతలో భాగంగా ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. కాగా, మొదటి విడుతలో మొత్తం 12,09,439 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
27.34% voters turnout recorded till 11 am in the first phase of #ManipurElections2022 pic.twitter.com/UK7ru4aW0h
— ANI (@ANI) February 28, 2022
ఇందులో 5,80,607 మంది పురుషులు, 6,28,657 మంది మహిళలు, 175 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరికోసం ఎన్నికల కమిషన్ 171 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్చి 5న రెండో దశ ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 10న ఫలితాలు వెలువడుతాయి.