kerala covid cases : కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ప్రతిరోజూ 25 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా కొత్తగా 25,010 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే కరోనా మరణాలు కూడా కేరళలో రోజూ 150కి తగ్గకుండా నమోదవుతున్నాయి. ఇవాళ కూడా 177 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో కరోనా రికవరీలు, మరణాలు పోను మరో 2,37,643 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అదేవిధంగా కేరళలో పాజిటివిటీ రేటు కూడా 16.53 శాతంగా ఉన్నది. ఇవాళ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతుండటంతో ఇక్కడ పాఠశాలలు పునఃప్రారంభించాలా.. వద్దా..? అనే విషయాన్ని సీరియస్గా పరిగణిస్తున్నామని విజయన్ చెప్పారు.