న్యూఢిల్లీ: కంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన 250 మందికి విముక్తి కల్పించి, స్వదేశానికి రప్పించినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. వీరితో చట్టవిరుద్ధంగా సైబర్ వర్క్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. భారతీయులు కంబోడి యాలో చిక్కుకున్న విషయంపై మీడియా కథనాలతోపాటు బాధి తుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఇండియన్ ఎంబసీ సకాలంలో స్పందించిందని తెలిపింది.