చెన్నై: ఒక ప్రైవేట్ స్కూల్లో 25 మంది విద్యార్థులకు కరోనా సోకింది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహించగా 25 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిల్ అడ్మిట్ అయ్యారని, మిగతా వారు హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో వారి నమూనాలను జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్కు పంపినట్లు చెప్పారు. ఆ ప్రైవేట్ స్కూల్లోని మిగతా విద్యార్థులతోపాటు టీచర్లు, సిబ్బందికి కూడా కరోనా టెస్ట్ చేస్తామన్నారు. శానిటైజేషన్ కోసం ఆ స్కూల్ను వారం రోజులు మూసివేస్తామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.