ముంబై, మార్చి 1: సబ్బుల్లో పెట్టి తరలిస్తున్న రూ.25 కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ను ముంబై ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. ఇథియోఫియాలోని అడ్డిస్ అబాబా ఎయిర్పోర్టు నుంచి ముంబైకు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఈ కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. 12 సబ్బుల్లో కొకైన్ను దాచి బ్యాగ్లో పెట్టుకొని వస్తుండగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు.