న్యూఢిల్లీ, మార్చి 7: ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటున్నారా? సముద్రాల్లో ప్రయాణిస్తూ ప్రపంచ వింతలను చూడాలనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం మీ కోసమే.. ఎంవీ జెమిని అనే నౌక నవంబర్ 1న ఇస్తాంబుల్ నుంచి ప్రారంభమవుతుంది. మూడేండ్లలో 135 దేశాలను చుట్టేస్తుంది. 1.30 లక్షల మైళ్లు ప్రయాణించే ఈ నౌకలో రెస్టారెంట్, లైబ్రరీ, వినోదం తదితర సౌకర్యాలు ఉన్నాయి. టికెట్ ప్రారంభ ధర రూ.24 లక్షలు అని నిర్వాహకులు తెలిపారు.