న్యూఢిల్లీ, జనవరి 16: ప్రపంచ ఆస్తుల్లో 43 శాతం కేవలం ఒక శాతం సంపన్న వర్గాల గుప్పిట్లోనే మగ్గుతున్నాయి. ఇదే ధోరణి మధ్యప్రాచ్యం, ఆసియా, యూరప్ దేశాల్లో కూడా కొనసాగుతున్నది. అక్కడ కూడా కేవలం ఒక శాతం సంపన్న వర్గాల చేతిలో 47 నుంచి 50 శాతం ఆస్తులున్నట్టు ఆక్స్ఫాం నివేదిక వెల్లడించింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం సమస్య సమసిపోవాలంటే మరో 200 ఏండ్లకు పైగా సమయం పడుతుందని వెల్లడించింది.