ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) కరోనా విలయతాండవం చేస్తున్నది. మహానగరంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో వివిధ దవాఖానల్లో మొత్తం 230 మంది రెసిడెంట్ డాక్టర్లు కరోనా బారిన పడ్డారని జేజే హాస్పిటల్ ప్రెసిడెంట్ గణేశ్ సోలంకి తెలిపారు. అదేవిధంగా బ్రిహిన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్కు చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా సోకిందని అధికారులు తెలిపారు. దీంతో సంస్థలో ఇప్పటివరకు కరోనాబారినపడిన ఉద్యోగుల సంఖ్య 60కి చేరింది.
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 26,538 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలోనే 15,166 కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 6,75,76,032కు చేరాయి. ఇందులో 87,505 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.