Railing Collapses | ఉత్తర ప్రదేశ్లోని ఓ ఆలయంలో నిర్వహించిన ముందస్తు హోలీ వేడుకల్లో (Pre Holi Event) అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలోని మెట్ల రెయిలింగ్ విరిగిపడటంతో (Railing Collapses) పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు (Devotees Injured) ఆలయ అధికారులు సోమవారం తెలిపారు.
ఆలయ ప్రధాన అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్సానా (Barsana)లోని రాధా రాణి ఆలయం (Radha Rani temple)లో ఆదివారం సాయంత్రం ముందస్తు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తుల కోసం లడ్డూను పంపిణీ చేస్తుండగా.. ప్రసాదం కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ సమయంలో ఆలయంలో మెట్ల రెయిలింగ్ ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘటనలో 22 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆలయంలో రద్దీని నియంత్రించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లు అధికారులు వివరించారు.
Also Read..
Arvind Kejriwal | ఢిల్లీ జల బోర్డు కేసు.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి డుమ్మా
Building Collapse | కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు దుర్మరణం
WPL 2024 | నయా చాంపియన్కు 6 కోట్ల ప్రైజ్మనీ.. ఆ ఐదు అవార్డులూ ఆర్సీబీకే