కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాకా గార్డెన్ రీచ్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను హుటాహుటిన దవాఖానకు తరలించారు. సోమవారం ఉదయం రంగంలోకి దిగిన 50 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నది. కాగా, భవనంలో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. కానీ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిసెలపై శిథిలాలు పడ్డాయని చెప్పారు. ఇంకా పదుల సంఖ్యలో శిథిలాల్లో చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఘటనా స్థలాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సందర్శించారు. సహాయక చర్యలను గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో ఇద్దరు మరణించారని, మరో ఐదారుగురు శిథిలాల్లో చిక్కుకుపోయారని చెప్పారు. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.
#WATCH | West Bengal | Search & rescue operation underway in Metiabruz, South Kolkata, after a 5-storey under-construction building collapsed. Further details awaited. pic.twitter.com/ovhbwX9uFi
— ANI (@ANI) March 18, 2024
#WATCH | West Bengal CM Mamata Banerjee says, “… Rescue work was started immediately after the accident. Two people have died, 5-6 people are still trapped inside, they will also be rescued soon. Officials from medical, fire and other departments are deployed. The building was… pic.twitter.com/ExUv1nxkbS
— ANI (@ANI) March 18, 2024