న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం నాటికి 24 గంటల వ్యవధిలో 2,151 కేసులు నమోదయ్యాయి. గత ఐదు నెలల్లో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య (చికిత్స పొందుతున్నవాళ్లు) 11,903కు పెరిగింది. వ్యాధిబారిన పడిన వారిలో ఐదుగురు మరణించారు.