న్యూఢిల్లీ, జూలై 20: పదోన్నతి పొందినవారిలో మొత్తం 21 మంది జడ్జీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.
వారు అదుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ రాధాకృష్ణ కృప సాగర్, శ్యాంసుందర్ బండారు, శ్రీ శ్రీనివాస్ వేటుకూరు, బొప్పన వరహ లక్ష్మీనరసింహా చక్రవర్తి, తల్లప్రగడ మల్లికార్జున రావు, దుప్పాల వెంకటరమణ. మిగిలిన 14 మందిలో 9 మంది అలహాబాద్ హైకోర్టుకు, ఐదుగురు కర్ణాటక హైకోర్టుకు జడ్జీలుగా పదోన్నతి పొందారు.