మంథని టౌన్/ మంథని రూరల్, ఏప్రిల్ 14: మంథనిలో 32 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మంథని ప్రభుత్వ దవాఖానలో 65 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 25 మందికి పాజిటివ్గా వచ్చింది. అలాగే గద్దలపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో సూరయ్యపల్లిలో 120 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఏడుగురికి కరోనా పాజిటివ్గా వచ్చింది. కార్యక్రమంలో సర్పంచ్ పుష్ప, ఎంపీటీసీ వెంకటస్వామి, వైద్యాధికారి శంకరాదేవి, ఉప సర్పంచ్ రాజిరెడ్డి, వార్డు సభ్యులు నరేశ్, శంకర్, వైద్య సిబ్బంది శ్వేత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 14: రాఘవాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 167 మం దికి, రాగినేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 270 మందికి కొవిడ్ టీకాలు వేశారు. అలాగే రాఘవాపూర్లో 120 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ మమత తెలిపారు. రాగినేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 245 మందికి పరీక్షలు చేయగా కాపులపల్లికి చెందిన ఇద్దరికి, దేవునిపల్లి, పాలితం, రాజన్న సిరిసిల్లకు చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ ఫణీంద్ర తెలిపారు.
కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 14: మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో బుధవారం 122 మందికి కరోనా నిరార్ధణ పరీక్షలు చేయగా, ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని, 36 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. జాఫర్ఖాన్పేటలో ఇప్పటికే 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు కూనారం వైద్యాధికారి మహేందర్ తెలిపారు.
టీకా వేయాలి
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్ టీకాలు వేయాలని డాక్టర్ ప్రవీణ్కుమార్ను జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి కోరా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను బుధవారం ఆయన పరిశీలించారు.
వ్యాపారులకు జరిమానా
ఫర్టిలైజర్సిటీ, ఏప్రిల్ 14: రామగుండం ట్రాఫిక్ పోలీసులు వివిధ వ్యాపార కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని దుకాణాల్లోని వారు మాస్కులు ధరించకపోవడంతో జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు.
150 మందికి..
జ్యోతినగర్, ఏప్రిల్ 14:ఎన్టీపీసీ పోలీసులు మాస్కులు ధరించని 150 మందికి ఈ చాలన్ ద్వారా బుధవారం జరిమానా విధించారు. ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్రాజ్ పెట్రోలింగ్ నిర్వ హించి మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారికి జరిమానా వేశారు. అలాగే ఎఫ్సీఐ క్రాస్రోడ్లో గుంపులుగా ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏఎస్ఐ సుధాకర్, కానిస్టేబుల్ మల్లికార్జున్, రాజశేఖర్ ఉన్నారు.
ఫ్లెక్సీల ఏర్పాటు
ముత్తారం, ఏప్రిల్14: ఓడేడులో సర్పంచ్ సిరికొండ బక్కారావు ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలపై బుధవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. గ్రామంలో మాస్కులు లేకుండా తిరిగితే రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవునూరి భానుకుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కళా బృందం ప్రదర్శన
సుల్తానాబాద్, ఏప్రిల్ 14: ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కళాబృందం బుధవారం సు ల్తానాబాద్లో ప్రదర్శన ఇచ్చింది. పట్టణ ప్రధాన వీధుల్లో కళాబృందం కరోనాపై పాటలు పాడి ప్రజలను చైతన్య పరించింది. తప్పని సరి మాస్క్ ధరించాలనిచ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. కార్యక్రమంలో ఎస్ఐ ఉపేందర్రావు, మున్సిపల్ కమిషనర్ ఎం శ్రీనివాస్రెడ్డి, ముత్యం రమేశ్, కూకట్ల గోపి, రఫీక్, పసెడ్ల సంపత్ తదితరులున్నారు.
ఎలిగేడు, ఏప్రిల్ 14: ఎలిగేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 76 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు వైద్యాధికారి నిస్సీక్రిస్టినా తెలిపారు. టీకాల విషయంలో ఆందోళన వద్దని వైద్యాధికారి, హెల్త్ సూపర్వైజర్ గంగమరాజు చెప్పారు.