హువాలియన్: తైవాన్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 48కి చేరుకున్నది. ఆ రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 బోగీలతో వెళ్తున్న ఆ రైలు.. ఓ టన్నెల్ వద్ద వాహనాన్ని ఢీకొట్టింది. ట్రాక్పై నిర్మాణ వాహనం అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్ మధ్యలో నుజ్జు అయిన బోగీల్లో ప్రయాణికులు చిక్కుకున్నారు. వారిని రెస్కూ సిబ్బంది రక్షించింది. రాజధాని తైపి నుంచి టైటుంగ్కు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. రైలు కిక్కిరిసిపోవడంతో అనేక మంది ప్రయాణికులు నిలిచి ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు త్సాయి ఇంగ్ వెన్ సంతాపం తెలిపారు. ఘటన పట్ల విచారణకు ఆదేశించారు. తైవాన్లో ప్రస్తుతం టాంబ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ రైలు ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుంది. పట్టాలు తప్పిన బోగీల నుంచి సుమారు వంద మంది ప్రయాణికులను రక్షించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాకింగ్షుయి టన్నెల్ వద్ద రైలు ప్రమాదం జరిగింది.