ఛత్రపతి సాంబాజీనగర్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగిన ఓ మతపరమైన వేడుకలో కలుషిత ఆహారం(Food Poisoning) తిన్న సుమారు రెండు వేల మంది అస్వస్థతకు లోనయ్యారు. లోహ తహిసిల్లో ఉన్న కోస్టివాడి గ్రామంలో మంగళవారం ఓ మతపరమైన ఈవెంట్ జరిగింది. స్థానికులతో పాటు సమీపంలోని సవార్గావ్, పోస్టవాడి, రిసన్గావ్, మాస్కీ గ్రామాల ప్రజలు కూడా ఆ ఈవెంట్కు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు అందరు కలిసి భోజనం చేశారు.
బుధవారం తెల్లవారుజామున వాంతులు, విరోచనాలు అవుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. నాందేడ్లోని లోహ ఆస్పత్రిలో తొలుత 150 మంది చేరారు. ఆ తర్వాత అవే లక్షణాలతో మరికొందరు ఆస్పత్రిలో చేరారు. శంకరో చావాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 870 మంది పేషెంట్లను అడ్మిట్ చేశారు.
నాందేడ్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో మరికొన్ని బెడ్స్ను ఏర్పాటు చేశారు. బాధిత పేషెంట్ల నుంచి శ్యాంపిళ్లను సేకరించి దర్యాప్తు చేపట్టారు. బాధిత గ్రామాల్లో సర్వే కోసం అయిదు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ విషయాన్ని తేల్చేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను కూడా ఏర్పాటు చేశారు.
కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైనా, ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు.