తిరువనంతపురం: కేరళలోని (Kerala) మలప్పురంలో పెను ప్రమాదం తప్పింది. ఫుట్బాల్ టోర్నీ సందర్భంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక గ్యాలరీ కూలిపోయింది. దీంతో 200 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మలప్పురంలోని పూన్గోడ్లో ఉన్న ఎల్పీ స్కూల్లో ఆల్ ఇండియా సెవన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా స్కూల్ గ్రౌండ్లో తాత్కాలికంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు.
అయితే మ్యాచ్ చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. పరిమితికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చోవడంతో అది కుప్పకూలిపోయింది. దీంతో 2 వందల మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
#WATCH Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday; Police say around 200 people suffered injuries including five with serious injuries#Kerala pic.twitter.com/MPlTMPFqxV
— ANI (@ANI) March 20, 2022
కాగా, మ్యాచ్ చూడటానికి 8 వేల మందికిపైగా వచ్చారని, గాయపడిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుందని స్థానిక మీడియా తెలిపింది. వారిలో సగం మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించారని, 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నది.