లక్నో: యూపీలోని బందా జిల్లాలో దారుణం జరిగింది. యమునా నదిలో గురువారం పడవ బోల్తా పడటంతో 20 మందికి పైగా గల్లంతయ్యారు. పడవ బోల్తా పడిన సమయంలో అందులో దాదాపు 36 మంది ప్రయాణిస్తున్నారు. పడవ మర్కా ఘాట్ నుంచి ఫతేపూర్కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులతో రాఖీ పండుగను జరుపుకునేందుకు మహిళలు తమ గ్రామానికి వెళ్లేందుకు పడవలో ప్రయాణిస్తున్నారు.
పడవలో ఉన్న వారిని ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. కాగా, ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో ఆరేడుగురు నీటి ప్రవాహం నుంచి బయటకువచ్చారని, మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదని చెప్పారు.సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.