ముంబై : ముంబైలోని ఓ అపార్ట్మెంట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సుమారు 20 మోటారు బైక్లు కాలి బూడిదయ్యాయి. కుర్లాలోని నెహ్రూ నగర్లో ఉన్న రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఘటన పట్ల విచారణ చేపట్టారు.