శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పోలీసులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్లోని షోపియాన్ జిల్లా (Shopian) అమ్శీపొరాలో ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు.
దీంతో ప్రతిగా పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారివద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు.