న్యూఢిల్లీ: విమానం కాక్పిట్లోకి గర్ల్ఫ్రెండ్ను తీసుకువెళ్లిన కేసులో.. ఇద్దరు ఎయిర్ ఇండియా పైలెట్ల(Air India Pilots)పై వేటు పడింది. ఢిల్లీ నుంచి లేహ్కు వెళ్తున్న విమానంలో గత వారం ఈ ఘటన జరిగింది. క్యాబిన్ సిబ్బంది నుంచి ఫిర్యాదు రావడంతో పైలెట్, కో పైలెట్పై ఎయిర్ ఇండియా యాజమాన్యం చర్యలు తీసుకున్నది. ఏఐ-445 విమానం కాక్పిట్లోకి ఓ మహిళా ప్యాసింజెర్ ఎంటరైందని, రూల్స్ పాటించకుండా పైలెట్కు చెందిన మహిళా ఫ్రెండ్ వెళ్లినట్లు ఫిర్యాదు అందింది. అయితే ఆ ఇద్దరు పైలెట్లను గ్రౌండ్ చేశామని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఘటన పట్ల తమకు ఫిర్యాదు అందిందని, దాని ప్రకారమే చర్యలు తీసుకున్నామని పౌర విమానయాన సంస్థ కూడా పేర్కొన్నది. ఈ ఘటన పట్ల సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టేందుకు కమిటీని ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.