ముంబై: కుక్కలను చంపుతున్న రెండు కోతులను అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్గావ్లో కుక్కలపై కోతులు పగపట్టాయి. ఒక కోతి పిల్లను కుక్క చంపిన ఘటన తర్వాత స్థానిక కోతులు కుక్క పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వాటిని ఎత్తుకెళ్లి ఎత్తైన చెట్లు, ఇండ్ల మీద నుంచి కింద పడేసి చంపుతున్నాయి. ఇప్పటి వరకు 250 కుక్క పిల్లలను కోతులు ఇలా మట్టుబెట్టాయి. స్థానికులపైనా అకారణంగా దాడి చేస్తున్నాయి. చిన్న పిల్లలను కూడా కోతులు ఎత్తుకెళ్లి ఇలా చెట్లు, ఇండ్లపై నుంచి పడేసే ప్రమాదమున్నదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయం తెలిసిన నాగపూర్ అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. అనేక కుక్క పిల్లలను చంపిన రెండు కోతులను శనివారం తెల్లవారుజామున బీడ్లో పట్టుకున్నారు. ఈ రెండు కోతులను సమీపంలోని అడవిలో విడిచిపెట్టేందుకు నాగ్పూర్కు తరలించినట్లు బీడ్ అటవీ శాఖాధికారి సచిన్ కంద్ తెలిపారు.