Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 11: కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జేడీ(ఎస్) నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆసక్తికరమైన హామీ ఇచ్చారు. రైతుల కొడుకులను పెండ్లి చేసుకొనే మహిళలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటించారు.
‘రైతుల కొడుకులను పెండ్లి చేసుకొనేందుకు అమ్మాయిలు సిద్ధంగా లేరని నాకొక పిటిషన్ అందింది. రైతుల పిల్లల పెండ్లిళ్లను ప్రోత్సహించాలంటే ప్రభుత్వం అమ్మాయిలకు రూ.2 లక్షలు ఇవ్వాలి. ఇది అబ్బాయిల ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది’ అని కోలార్లో ఇటీవల జరిగిన పంచరత్న ర్యాలీని ఉద్దేశించి కుమారస్వామి అన్నారు. మరోవైపు ఎన్నికల తర్వాత పొత్తు కోసం జాతీయ పార్టీలు తనను సంప్రదిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అంతర్గత సర్వే ప్రకారం తమకు 25-30 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు.