ముంబై (నమస్తే తెలంగాణ): డ్రగ్స్కు బానిసలైన దంపతులు ఇద్దరు కన్నబిడ్డల్ని రూ.74 వేలకు అమ్మేసి ఆ సొమ్ముతో డ్రగ్స్ సేవించారు. ముంబైలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. షబ్బీర్ఖాన్, సానియా దంపతులు డ్రగ్స్కు బానిసయ్యారు. డ్రగ్స్ కొనేందుకు డబ్బుల కోసం వీరు తమ పిల్లలను అమ్మేశారు. షబ్బీర్ సోదరి ఫిర్యాదుతో కదిలిన పోలీసులు బాధితుల్లో ఒకరైన రెండు నెలల చిన్నారిని రక్షించారు.