బారాముల్లా : జమ్మూకశ్మీర్లోని బారాముల్ల జిల్లా కేంద్రంలో భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు భద్రతా సిబ్బందిపైకి గ్రెనైడ్ విసరడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు ఓ పోలీస్ అధికారికి తీవ్రగాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై నేడు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మెహతా అధ్యక్షత సమీక్ష సమావేశం జరగాల్సి ఉండగా ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదయం జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను జమ్మూకశ్మీర్ పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే.