ముంబై: రిచ్ ఫ్యామిలీకి చెందిన విద్యార్థితో పరిచయం పెంచుకున్న పోలీసులు, మరికొందరు కలిసి అతడ్ని కేఫ్కు రప్పించారు. అక్కడ అతడి జేబులో డ్రగ్స్ ఉంచారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. (cops extorted student) ఆ యువకుడి నుంచి సుమారు రూ.5 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం బయటపడటంతో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పింప్రి-చించ్వాడ్కు చెందిన 19 ఏళ్ల విద్యార్థితో కొందరు వ్యక్తులు పరిచయం పెంచుకున్నారు. ఆ యువకుడి నమ్మకాన్ని పొందడంతోపాటు వివరాలు తెలుసుకున్నారు. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని గ్రహించారు. బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేశారు.
కాగా, ఆ వ్యక్తులు విద్యార్థిని ఒక కేఫ్కు పిలిచారు. అక్కడ అతడి జేబులో డ్రగ్స్ ప్యాకెట్ ఉంచారు. ఇద్దరు పోలీసులు ఆ యువకుడ్ని తనిఖీ చేశారు. డ్రగ్స్ కలిగి ఉన్న అతడిపై కేసు నమోదు చేస్తామని బెదిరించారు. రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. ఆ విద్యార్థి రూ.4.98 లక్షలు వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు.
మరోవైపు ఆ యువకుడు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులను అనిల్ చౌదరి, అమన్ షేక్, హుస్సేన్ డాంగే, మహ్మద్ అహ్మర్ మీర్జా, శంకర్ గోర్డే, మున్నా స్వామి, సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ గైక్వాడ్, కానిస్టేబుల్ సచిన్ షెజ్వాల్లుగా గుర్తించారు. ఈ ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.