న్యూఢిల్లీ: సరిగ్గా 19 ఏండ్ల క్రితం మణిపూర్లో 12మంది మహిళలు అక్కడి భద్రతా బలగాల ముందు నగ్నంగా చేపట్టిన నిరసన ప్రదర్శన ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. 32 ఏండ్ల యువతిపై లైంగికదాడి..హత్య ఘటనకు నిరసనగా ఆనాడు మణిపూర్ అట్టుడికిపోయింది. సైనికులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపణలు వెలువడ్డాయి. మణిపూర్లో మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందని నాడు ఆ మహిళలు ఊహించలేదు. ప్రస్తుతం మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణాలు చోటుచేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకి సామాజికవర్గానికి ఇద్దరు మహిళలపై సామూహిక లైంగికదాడి, వారిని నగ్నంగా ఊరేగించటం తమను తీవ్రంగా కలిచివేసిందని జ్ఞానేశ్వరీ(73) అన్నారు. నాడు నగ్నంగా నిరసన ప్రదర్శనకు దిగిన 12మంది మహిళల్లో ఆమె ఒకరు. ‘మహిళా హక్కుల కోసం ఆనాడు గట్టిగా నిలబడ్డాం’ అని మరో మహిళ రమణి(95) ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్లో హింసను ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి ఆమె నిరసన తెలుపుతున్నారు. ‘బాధితులు ఏ వర్గం వారైనా, అప్పుడు పోరాడాం. ఇప్పుడూ పోరాడుతున్నాం’ అని 72 ఏండ్ల నాన్గ్బి అన్నారు.