Coronavirus | కొత్త ఏడాది ప్రారంభంలో విజృంభించిన కరోనా మహమ్మారి (Coronavirus) వ్యాప్తి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్నిరోజులుగా 500 పైనే నమోదైన రోజూవారీ కేసులు.. ఇప్పుడు 200 దిగువకు పడిపోయాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 189 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అత్యధికంగా కర్ణాటకలో 61 కేసులు బయటపడినట్లు తెలిపింది. మహారాష్ట్రలో 35, కేరళలో 25 కేసులు వెలుగు చూసినట్లు పేర్కొంది. ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 4,50,22,219కి పెరిగింది. నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,417కి చేరింది. నిన్న ఒక్కరోజే 372 మంది కొవిడ్ (COVID 19) నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,44,85,998గా ఉంది. మరోవైపు దేశంలో క్రియాశీల కేసులు మూడువేల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం దేశంలో 2,804 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Houthi Rebals | మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. అమెరికా నౌకపై క్షిపణితో దాడి
Donald Trump | రిపబ్లికన్ పార్టీ రేసులో ట్రంప్ షో.. ఫస్ట్ విక్టరీ కొట్టిన మాజీ ప్రెసిడెంట్