న్యూఢిల్లీ, మే 27: కడుపులో 181 కొకైన్ క్యాప్సూల్స్ను దాచుకుని ఉగాండా నుంచి విమానంలో భారత్ చేరుకున్న ఇద్దరు మహిళలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరి కడుపులో ఉన్న కొకైన్ దాదాపు 2 కేజీల బరువు ఉందని, దీని విలువ రూ.28 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
ఓ మహిళ గురువారం పట్టుబడగా, ఆమెను రాంమనోహర్ లోహియా దవాఖానకు తీసుకెళ్లగా, ఆమె కడుపులో 81 క్యాప్సూల్స్ ఉన్నాయి. వీటి బరువు 0.891 గ్రాములు ఉంది. దీని విలువ రూ.13.6 కోట్లు ఉంటుంది. 22న చిక్కిన మరో మహిళ కడుపులో 80 క్యాప్సూల్స్ను గుర్తించారు. వీటి బరువు 0.957 గ్రాములు ఉండగా, రూ.14 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.