ముంబై: ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్కు చెందిన డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. 18 ఏళ్ల సామ్యా మన్సూరీ అనే అమ్మాయికి చేయిని ట్రాన్స్ ప్లాంట్ చేశారు. కుడి చేతికి అవయవ మార్పిడి చేశారు. బర్త్డే గిఫ్ట్గా ఆమెకు అరుదైన కానుక ఇచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. గుజరాత్లోని బహరూచ్ ఆమె స్వంత ఊరు. పుట్టిన నాటి నుంచి ఆమెకు కుడి చేయి లేదు. అయితే ప్రస్తుతం సర్జరీ సక్సెస్ అయినట్లు డాక్టర్లు చెప్పారు.
చేయి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం సంతోషంగా ఉన్నట్లు ఆ అమ్మాయి చెప్పింది. చేతితో ఎన్నో పనులు చేయవచ్చు అని తెలిపింది. సామ్యా ప్రస్తుతం బీసీఏ చదువుతోంది. పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటోంది. ఆ తర్వాత సైబర్ క్రైమ్ టీమ్లో పనిచేయాలని సామ్యా భావిస్తోంది. చేయి లేకపోవడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, తాను యంగేజ్లో ఉన్నప్పుడు తోటి మిత్రులు టీజ్ చేసేవాళ్లు అని, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేదాన్ని కాదు అని ఆమె చెప్పింది.
అవయవాలను దానం చేయాలని, అవిలేని వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని సామ్యా కోరారు. 18 ఏళ్లు నిండిన తర్వాతనే చేయి సర్జరీ చేయాలని గతంలో డాక్టర్లు చెప్పారని, జనవరి పదో తేదీన ఆమెకు 18 ఏళ్లు వచ్చేశాయి. దీంతో ఆమె ట్రాన్స్ప్లాంటేషన్కు రిజిస్టర్ చేసుకున్నది. జనవరి 30వ తేదీన సర్జరీ జరిగినట్లు ఆమె తెలిపింది.