పుణె, జూన్ 7: మహారాష్ట్రలో సోమవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పుణె శివారుల్లోని పిరాన్ఘట్ ఎంఐడీసీ పారిశ్రామిక వాడలో ఉన్న ఎస్వీఎస్ ఆక్వా టెక్నాలజీస్ అనే రసాయనిక పరిశ్రమలో మంటలు చెలరేగడంతో కనీసం 18 మంది ఆహుతయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయన్నారు. ప్లాస్టిక్ మెటీరియల్ను ప్యాకింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు చెలరేగి ఉండొచ్చని కంపెనీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే క్లోరిన్ డైఆక్సైడ్ను పరిశ్రమలో తయారు చేస్తున్నట్టు పుణె ఎస్పీ అభినవ్ దేశ్ముఖ్ తెలిపారు.