బెంగళూరు: ఒక బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Massive fire) భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు దగ్ధమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం వీరభద్ర నగర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ డిపోలో పార్క్ చేసి ఉన్న బస్సుల్లో సుమారు 18 బస్సులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పది ఫైర్ ఇంజిన్లతో సంఘనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపు చేశారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గురులింగయ్య తెలిపారు. మంటల్లో కాలిన ప్రైవేట్ బస్సులు రిపేర్ కోసం అక్కడ ఉన్నాయని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మెకానిక్లు, వెల్డింగ్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారని అన్నారు. అయితే వారంతా పరుగులు తీసి అక్కడి నుంచి బయటపడ్డారని తెలిపారు. పెట్రోల్ వంటి మండే వస్తువులు ఆ డిపోలో పలు చోట్ల ఉన్నాయని తెలిపారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
Massive fire broken out at least 5 to 10 Buses Gutted near Veerbhadra Nagar in Bengaluru, India 🇮🇳 (30.10.2023)
Source: Nabila Jamal
TELEGRAM JOIN 👉 https://t.co/9cTkji5aZq pic.twitter.com/rN8p0ymSWh— Disaster News (@Top_Disaster) October 30, 2023
Private buses parked in a bus depot in Bengaluru’s Veerabhadranagar catch fire pic.twitter.com/soVNFniqut
— TOI Bengaluru (@TOIBengaluru) October 30, 2023